ఈ స్తోత్రంతో సూర్యారాధన చేస్తే రోగాలు మాయం !

 Authored By keshava | The Telugu News | Updated on :15 April 2021,6:00 am

Surya Aradana  :  సూర్యుడు.. సాక్షాత్తు దైవంగా అందరూ భావిస్తారు. ఆరాధిస్తారు. అనాదిగా సూర్యారాధనకు విశేషమైన ఆదరణ ఉంది. పూర్వీకులు సూర్యుడిని ఆరాధించి అనేక ప్రయోజనాలు పొందినట్లు మనకు అనేక పురాణాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ కాలంలో ఆరోగ్యం కోసం పలు వైద్యశాలలు వెళ్తుంటారు. కానీ నిజానికి ఆరోగ్యం కోసం పూర్వీకులు చెప్పిన విధానాలు పాటిస్తే తప్పక ఆరోగ్యం లభిస్తుంది. పలువురు ఈ విషయాన్ని నిరూపించారు కూడా. ప్రస్తుతం శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు కుష్టు రోగగ్రస్తుడైనపుడు సాక్షాత్తూ శ్రీకృష్ణుడి ఆదేశం ప్రకారం సాంబుడు సూర్యోపసన చేసాడు. దీంతో సూర్య భగవానుడు అతనికి స్వప్న దర్శనమిచ్చి తన ఏకవింశతి నామావళిని వినిపించి, పారాయణం చేయమన్నాడని పురాణాలలో ఉంది. అత్యంత ప్రభావవంతమైన ఈ స్తోత్రాన్ని ఎవరైతే సూర్యోదయ సమయంలో పఠిస్తారో వారికి తప్పక ఆయుః, ఆరోగ్యం కలుగుతాయి.

If you worship the sun with this hymn, diseases will be eaten!

If you worship the sun with this hymn, diseases will be eaten!

Surya Aradana  : సాంబ సూర్యస్తుతి :

‘‘ భాస్కరో భగవాన్ సూర్యః చిత్రభానుర్విభావసుహు
యమః సహస్రాంశుమాలీయమునా ప్రీతిదాయకః
దివాకరో జగన్నాధః సప్తాశ్వస్య ప్రభాకరః
లోక చక్షుః స్వయంభూశ్చ ఛాయారతి ప్రదాయకః
తిమిరారిర్దినధవో లోకత్రయ ప్రకాశకః
భక్తబంధుః దయాసింధుః కర్మసాక్షీ పరాత్పరః
ఏకవింశతి నామాని, యః పఠేదుదితే మయి
తస్య శాంతిం ప్రయచ్ఛామి సత్యం సత్యం వదామ్యహమ్’’

ఈ సూర్యారాధన చేస్తే ఆయువు, ఆరోగ్యం పెరుగుతాయి. శుచితో భక్తితో సూర్యోదయం సమయంలో ఈ ఆరాధన చేయాలి. కనీసం 40 రోజులు చేస్తే మీకు మంచి ఫలితాలు కన్పిస్తాయి.

keshava

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి