Konda Surekha : కొండా సురేఖ ఇష్యూలో పవన్ కళ్యాణ్, బాలయ్య మౌనంగా ఉన్నారెందుకు?
Konda Surekha : అక్కినేని కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన జుగుబ్సుకరమైన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. .ఈ ఇష్యూ పై తెలుగు సినిమా ఇండస్ట్రీ విరుచుకుపడుతుంది.. స్టార్స్ అందరూ ఏకమై దుర్మార్గపు మాటలని ఖండిస్తూ వస్తున్నారు..వ్యక్తిగత విషయాలను రాజకీయల కోసం వాడుకోవడం ఎంతో నీచమని ఎన్టీఆర్ కామెంట్ చేశారు. సురేఖ చేసిన చౌకబారు, నిరాధారమైన వ్యాఖ్యలను మహేశ్బాబు ఖండించారు.ఇలాంటి నిరాధరమైన మాటలు మాట్లాడటానికి మనసు ఎలా ఒప్పింది.. ఇలాంటి చర్యలను సినీ […]
ప్రధానాంశాలు:
Konda Surekha : కొండా సురేఖ ఇష్యూలో పవన్ కళ్యాణ్, బాలయ్య మౌనంగా ఉన్నారెందుకు?
Konda Surekha : అక్కినేని కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన జుగుబ్సుకరమైన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. .ఈ ఇష్యూ పై తెలుగు సినిమా ఇండస్ట్రీ విరుచుకుపడుతుంది.. స్టార్స్ అందరూ ఏకమై దుర్మార్గపు మాటలని ఖండిస్తూ వస్తున్నారు..వ్యక్తిగత విషయాలను రాజకీయల కోసం వాడుకోవడం ఎంతో నీచమని ఎన్టీఆర్ కామెంట్ చేశారు. సురేఖ చేసిన చౌకబారు, నిరాధారమైన వ్యాఖ్యలను మహేశ్బాబు ఖండించారు.ఇలాంటి నిరాధరమైన మాటలు మాట్లాడటానికి మనసు ఎలా ఒప్పింది.. ఇలాంటి చర్యలను సినీ ఇండస్ట్రీ చూస్తూ ఊరుకోదు అని మెగాస్టార్ ఘాటుగా స్పందించారు..
Konda Surekha వారి మౌనం వెనక కారణం?
ఈ ఇష్యూలో చిరంజీవితోపాటు మెగా ఫ్యామిలీ తారలందరూ స్పందించినా.. పవన్ కళ్యాణ్ స్పందించలేదు. అత్తారింటికి దారేది లాంటి చిత్రాల్లో తన సహనటిగా ఉన్న సమంతపై వాఖ్యలను ఆయన ఖండిస్తారేమోనని వారంతా ఆశించారు. హైడ్రా కూల్చివేతలపై స్పందించిన తరహాలోనే దీనిపైనా స్పందిస్తారని అందరూ భావించారు. రాజకీయ నేతగా కాకపోయినా..సినీ ప్రముఖుడిగా రియాక్ట్ అవుతారని అనుకున్నారు. తిరుపతిలో జరిగిన వారాహి సభలో నైనా ఆయన ఈ అంశంపై మాటవరసకైనా మాట్లాడుతారేమోనని భావించారు.ఆయన మౌనంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కొండా సురేఖ వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ ఘాటుగా స్పందించారు. నేరుగా మంత్రి పేరును ప్రస్తావిస్తూ దీటుగా సమాధానమిచ్చారు.
నందమూరి బాలకృష్ణ ఇది తనకు సంబంధం లేదన్నట్టుగా సైలెంట్గా ఉన్నారు. నాగార్జునతో పాత గొడవలు దృష్టిలో పెట్టుకుని బాలయ్య మాట్లాడటం లేదని కొందరు విమర్శిస్తున్నారు.ఇలాంటి సమయంలో బాలయ్య మొండి పట్టు వీడాలి..ఇప్పటికైనా బాలయ్య మౌనం వీడి ఇండస్ట్రీ మహిళపైన ఓ మంత్రి చేసిన అసహస్యకరమైన వ్యాఖ్యలపై స్పందిస్తే బాగుంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..ఈ వివాదానికి ముగింపు పలకాలని టీపీసీసీ చీఫ్ మహేష్ టాలీవుడ్ ను కోరారు. కానీ, ఇప్పటికీ సురేఖ వ్యాఖ్యల పైన రగడ కొనసాగుతోంది.ఈ ఇష్యూ పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నాచురల్ స్టార్ నాని, వరుణ్ తేజ్, నాగచైతన్య, చిన్మయి శ్రీపాద,అక్కినేని అఖిల్, కోన వెంకట్, విశ్వక్సేన్, మంచు మనోజ్, మంచు మనోజ్, మంచు లక్ష్మి, లావణ్య త్రిపాఠి, ఖుష్బూ, సుధీర్ బాబు, శ్రీకాంత్ ఓదెల, అక్కినేని అమల ఇంకా చాలా మంది సినీ ప్రముఖులు ఘాటుగా స్పందించారు.