Children Problems : మరో 25 ఏళ్లలో సగం మంది పిల్లలకు ఆ లోపం రావడం గ్యారెంటీ..ఇప్పటి నుండే జాగ్రత్త !! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Children Problems : మరో 25 ఏళ్లలో సగం మంది పిల్లలకు ఆ లోపం రావడం గ్యారెంటీ..ఇప్పటి నుండే జాగ్రత్త !!

 Authored By sudheer | The Telugu News | Updated on :17 August 2025,8:00 pm

Children Eye problems : మన కళ్లే మనకు ఈ ప్రపంచాన్ని చూపించే అద్భుతమైన వరం. కానీ నేటి ఆధునిక జీవనశైలిలో డిజిటల్ పరికరాల వాడకం విపరీతంగా పెరగడంతో కంటి సమస్యలు చిన్న వయసులోనే మొదలవుతున్నాయి. ఒకప్పుడు కళ్లజోడు వృద్ధాప్యానికి సూచికగా భావించేవారు. కానీ ఇప్పుడు పిల్లలకే కళ్లజోడు అవసరం కావడం సాధారణమైంది. కంప్యూటర్, మొబైల్, టీవీ వంటి స్క్రీన్‌ల ముందు ఎక్కువ సమయం గడపడం, పోషకాహార లోపం వంటి కారణాలు దీనికి దారి తీస్తున్నాయి.

Children Eye problems

Children Eye problems

ప్రత్యేకంగా పాఠశాల వయసు పిల్లల్లో దగ్గరి చూపు (Myopia), మసక చూపు వంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. భారతీయ కంటి వైద్యుల సంఘం హెచ్చరించినట్లు, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి పిల్లల్లో సగానికి పైగా ఈ సమస్యతో బాధపడే అవకాశం ఉంది. కంటి సమస్యలతో పాటు డిజిటల్ పరికరాల అధిక వాడకం వల్ల ఊబకాయం, శారీరక శ్రమ లోపం, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతోంది. ఇది రాబోయే కాలంలో సమాజానికి పెద్ద సవాలుగా మారనుంది.

ఈ పరిస్థితిని నియంత్రించేందుకు తల్లిదండ్రులు ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల స్క్రీన్ టైమ్‌ను కట్టడి చేయడం, వారిని బయట ఆటలకు ప్రోత్సహించడం, పోషకాహారంతో కూడిన ఆహారం అందించడం, కంటి వ్యాయామాలు నేర్పించడం వంటి చర్యలు అవసరం. క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించడం కూడా ఎంతో ముఖ్యం. మొబైల్, టాబ్లెట్ వంటి పరికరాలు జ్ఞానం పెంచడానికి ఉపయోగపడినా, వాటిని పరిమితంగా వాడే అలవాటు పెంచడం ద్వారా పిల్లల కంటి చూపును కాపాడవచ్చు. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం కళ్ల సంరక్షణ ఇప్పుడే ప్రారంభించాలి.

sudheer

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది