YSRCP : బద్వేలు వైసీపీదే.. సుధకు సీఎం జగన్ కంటే ఎక్కువ మెజారిటీ.. | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

YSRCP : బద్వేలు వైసీపీదే.. సుధకు సీఎం జగన్ కంటే ఎక్కువ మెజారిటీ..

YSRCP : ఆంధప్రదేశ్‌లో‌ని బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ జయకేతనం ఎగురవేసింది. అధికార పార్టీ రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 13 రౌండ్లు ముగిసే సరికి 90,950 ఓట్ల భారీ ఆధిక్యంతో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ ఎమ్మెల్యేగా విజయం సాధించింది. బీజేపీ, కాంగ్రెస్ పోటీలో నిలిచి ఓటమి పాలయ్యాయి.2019 సాధారణ ఎన్నికల్లో బద్వేలు ఎమ్మెల్యేగా గెలుపొందిన సుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఆ నేపథ్యంలో ఈ స్థానానికి ఉప ఎన్నిక రాగా, వైసీపీ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :2 November 2021,2:40 pm

YSRCP : ఆంధప్రదేశ్‌లో‌ని బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ జయకేతనం ఎగురవేసింది. అధికార పార్టీ రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 13 రౌండ్లు ముగిసే సరికి 90,950 ఓట్ల భారీ ఆధిక్యంతో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ ఎమ్మెల్యేగా విజయం సాధించింది. బీజేపీ, కాంగ్రెస్ పోటీలో నిలిచి ఓటమి పాలయ్యాయి.2019 సాధారణ ఎన్నికల్లో బద్వేలు ఎమ్మెల్యేగా గెలుపొందిన సుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఆ నేపథ్యంలో ఈ స్థానానికి ఉప ఎన్నిక రాగా, వైసీపీ దివంగత ఎమ్మెల్యే భార్య దాసరి సుధను బరిలో నిలిపింది.

ysrcp sudha won in badwel by poll

ysrcp sudha won in badwel by poll

కాగా, ఈమె తన భర్త కంటే ఎక్కువ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పులివెందులలో వచ్చిన మెజారిటీ కంటే కూడా ఎక్కువ మెజారిటీ ఓట్లను దాసరి సుధ సొంతం చేసుకోవడం విశేషం. పదమూడు రౌండ్లు ముగిసే నాటికి 90 వేల పై చిలుకు ఓట్లు మెజారిటీ రాగా, బీజేపీ అభ్యర్థి పనతల సురేశ్‌పై సుధ విక్టరీ సాధించింది. పులివెందుల ఎమ్మెల్యేగా జగన్‌కు 90,110 ఓట్ల మెజారిటీ రాగా, దాసరి సుధకు 90,950 ఓట్ల ఆధిక్యం లభించింది. బద్వేలు అసెంబ్లీ ఎలక్షన్స్ హిస్టరీలోనే డాక్టర్ దాసరి సుధ అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంలో అధికార వైసీపీ నేతలు, కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిని ప్రతిపక్ష టీడీపీ, జనసేన బలపరిచన సంగతి తెలిసిందే.

YSRCP : అధికార పార్టీ నేతల సంబురాలు..

Ysrcp

Ysrcp

కాగా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం తమ అభ్యర్థులను బరిలో దింపి పోటీలో నిలిచి ఓడిపోయాయి. ప్రాంతీయ పార్టీ అయిన వైసీపీ చేతిలో జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఓటమి పాలయ్యాయి. 13 రౌండ్లు ముగిసే సరికి వైఎస్ఆర్‌సీపీకి 1,12,072 ఓట్లు రాగా, బీజేపీకి 21,661 ఓట్లు, కాంగ్రెస్‌కు 6217 ఓట్లు వచ్చాయి. భారీ విజయం సొంతం అయిన నేపథ్యంలో అధికార వైసీపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది