Imprisonment : చేయని హత్యకు రెండేళ్ల జైలు శిక్ష.. కట్ చేస్తే ఆ మహిళ బ్రతికే ఉంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Imprisonment : చేయని హత్యకు రెండేళ్ల జైలు శిక్ష.. కట్ చేస్తే ఆ మహిళ బ్రతికే ఉంది..!

 Authored By ramu | The Telugu News | Updated on :28 June 2025,7:00 pm

ప్రధానాంశాలు:

  •   కర్ణాటక రాష్ట్రంలో చేయని హత్యకు జైలు శిక్ష

  •  Imprisonment : చేయని హత్యకు రెండేళ్ల జైలు శిక్ష.. కట్ చేస్తే ఆ మహిళ బ్రతికే ఉంది..!

Imprisonment  : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్ అనే వ్యక్తిపై తన భార్యను హత్య చేశాడన్న ఆరోపణలతో కేసు నమోదు అయింది. దీంతో అతడు దాదాపు రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. అయితే ఏప్రిల్ 2025లో అంచనాలకు విరుద్ధంగా అతడి భార్య సజీవంగా కనిపించడంతో ఈ కేసులో భారీ ట్విస్ట్ వచ్చింది. దీంతో మైసూరు 5వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సురేశ్‌ను నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది.

Imprisonment చేయని హత్యకు రెండేళ్ల జైలు శిక్ష కట్ చేస్తే ఆ మహిళ బ్రతికే ఉంది

Imprisonment : చేయని హత్యకు రెండేళ్ల జైలు శిక్ష.. కట్ చేస్తే ఆ మహిళ బ్రతికే ఉంది..!

Imprisonment : చేయని హత్యకు జైలు శిక్ష.. నష్ట పరిహారం చెల్లించాల్సిందే అంటూ కోర్ట్ మెట్లు ఎక్కిన బాధితుడు

సురేశ్ అన్యాయంగా జైలు పాలయ్యాడని గుర్తించిన కర్ణాటక హోం శాఖ అతనికి రూ.1 లక్ష పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఈ పరిహారంతో తాను ఎదుర్కొన్న మానసిక, సామాజిక అవమానాలను సమీక్షించలేని పరిస్థితుల్లో ఉన్నానని సురేశ్ పేర్కొన్నాడు. తన జీవితంలో వచ్చిన ఆర్థిక నష్టం, కుటుంబంలో ఏర్పడ్డ అవమానం, జైల్లో గడిపిన శిక్ష ఇవన్నీ కలిపి తనకు జరిగిన అన్యాయం ఎంతగానో మిగిలిపోతోందని ఆవేదన వ్యక్తం చేశాడు.

దీంతో సురేశ్ తాజాగా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. తనపై తప్పుడు కేసు నమోదు చేసిన అధికారులు, విచారణలో నిర్లక్ష్యం వహించిన పోలీస్ వ్యవస్థపై చర్యలు తీసుకోవాలని కోరుతూ క్రిమినల్ అప్పీల్ దాఖలు చేశాడు. అంతేకాదు, తనకు జరగాల్సిన న్యాయ పరిహారం కింద రూ.5 కోట్లకు పైగా నష్టపరిహారం చెల్లించాలని కోరాడు. ఈ ఘటన కర్ణాటకలోనూ, దేశవ్యాప్తంగా సామాన్యులకు న్యాయ వ్యవస్థపై పలు ప్రశ్నలను మిగిల్చేలా మారింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది