Mahaboobnagar..నర్సింహులు కుటుంబాన్ని ఆదుకుంటాం: ఎమ్మెల్యే ఆల | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mahaboobnagar..నర్సింహులు కుటుంబాన్ని ఆదుకుంటాం: ఎమ్మెల్యే ఆల

 Authored By praveen | The Telugu News | Updated on :7 September 2021,6:01 pm

కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని దేవరకద్ర శాసన సభ్యుడు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని మూసాపేట మండల పోల్కంపల్లి సమీపంలోని గాజులపేట గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నర్సింహులు రెండు వారాల కిందట హార్ట్ అటాక్‌తో చనిపోయారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి బాధితుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధితుడి కుటుంబీకులకు రూ.20 వేల సాయం అందజేశారు. నర్సింహులు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.

నర్సింహులు కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే భరోసానిచ్చారు. నర్సింహులు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆల హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి వెంట స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఇకపోతే ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో భాగంగా కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు వంద మంది సీఆర్పీఎప్ జవాన్లు సైకిల్ యాత్ర చేస్తుండగా సోమవారం వారు దేవరకద్రలోని కొత్తకోటకు చేరుకోగా వారికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి స్వాగతం పలికారు. యువత ఆధ్వర్యంలో వారితో కలిసి కొద్ది దూరం సైకిల్ యాత్ర చేశారు.

 

 

Advertisement
WhatsApp Group Join Now

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది