East godavari..ప్రతీ ఒక్కరు సామాజిక స్పృహ అలవర్చుకోవాలి | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

East godavari..ప్రతీ ఒక్కరు సామాజిక స్పృహ అలవర్చుకోవాలి

నేటి ఉరుకుల పరుగుల జీవనంలో ప్రజలు ఎవరి పనిలో వారే ఉండిపోతున్నారని, ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరు సామాజకి బాధ్యత, స్పృహ అలవర్చుకోవాలని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. సామాజిక బాధ్యత కలిగిన వారు మాత్రమే సొసైటీ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉంటారని చెప్పారు. రాజమండ్రి ప్రకాశ్ నగర్‌లో మై ఇండియా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పేదల కోసం ఉచిత అంబులెన్స్ సర్వీసును శుక్రవారం ఎమ్మెల్యే జక్కంపూడి ప్రారంభించారు. ఈ సందర్భంగా జక్కంపూడి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు సమాజ […]

 Authored By praveen | The Telugu News | Updated on :10 September 2021,10:16 pm

నేటి ఉరుకుల పరుగుల జీవనంలో ప్రజలు ఎవరి పనిలో వారే ఉండిపోతున్నారని, ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరు సామాజకి బాధ్యత, స్పృహ అలవర్చుకోవాలని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. సామాజిక బాధ్యత కలిగిన వారు మాత్రమే సొసైటీ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉంటారని చెప్పారు. రాజమండ్రి ప్రకాశ్ నగర్‌లో మై ఇండియా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పేదల కోసం ఉచిత అంబులెన్స్ సర్వీసును శుక్రవారం ఎమ్మెల్యే జక్కంపూడి ప్రారంభించారు. ఈ సందర్భంగా జక్కంపూడి మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు సమాజ అభివృద్ధికి పాటు పడాలని కోరారు.

అందరూ సమాజం కోసం తిరిగి ఇచ్చే సంస్కృతిని అలవర్చుకోవాలని, తోటి వారి కోసం, పేదల కోసం తమ వంతు సాయం, తోడ్పాటు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోనే పేదల కోసం ఉచిత అంబులెన్స్ అందజేసి, సర్వీసు స్టార్ట్ చేసి మై ఇండియా ఫౌండేషన్ వారిని ఎమ్మెల్యే జక్కంపూడి అభినందించారు. కార్యక్రమంలో మై ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

 

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది